Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో స్థానిక సమరానికి బ్రేకులు వేసిన సుప్రీంకోర్టు

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (17:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సమరానికి సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది. 50 శాతానికి మించి రిజర్వేన్లు ఇవ్వడం న్యాయ సమ్మతం కాదనీ పేర్కొంది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో విచారణ జరిపాలని రాష్ట్ర హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. 
 
నవ్యాంధ్రలో స్థానిక సమరానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ సర్కారు సిద్ధమైంది. అయితే, ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన సీట్ల రిజర్వేషన్లను 59.85 శాతంగా నిర్ణయించింది. ఈ మేరకు జీవో నంబరు 176ను జారీచేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ కర్నూల్ కు చెందిన బిర్రు ప్రతాప్ రెడ్డి పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు ప్రభుత్వం నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేస్తూ స్టేకు నిరాకరించింది.
 
దీంతో పిటిషనరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించింది. పైగా, ఈ రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చూడాలంటూ వేసిన రెండు పిటిషన్లను విచారణకు స్వీకరించి, నాలుగు వారాల్లోగా కేసు విచారణను పూర్తి చేయాలని హైకోర్టును సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే విధించింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments