Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి పంటకు మద్దతు ధర కల్పించాలి: సిపిఐ

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (20:13 IST)
ఉల్లి పంటకు మద్దతు ధర కల్పించి, పంట కొనుగోలుకు సత్వర చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి శనివారం లేఖ రాశారు.

సిపిఐ చేపట్టిన పల్లెబాట కార్యక్రమంలో భాగంగా గురు, శుక్రవారాల్లో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించామని, ఈ సందర్భంగా ఉల్లి రైతుల కష్టాలను కళ్లారా చూశామని పేర్కొన్నారు. ఈ ఖరీఫ్‌ సీజన్లో దిగుబడయిన ఉల్లి పంట కొనుగోలు లేకపోవడంతో ఉల్లి రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని తెలిపారు.

ఎకరాకు దాదాపు రు.70-80వేల వరకు ఖర్చు పెట్టి ఉల్లి పంట వేసిన రైతుకు కన్నీరే మిగిలిందని పేర్కొన్నారు. ఉల్లి అమ్మకాలకు ప్రధాన కేంద్రమైన కర్నూలు మార్కెట్‌ యార్డు కరోనా విపత్తు కారణంగా మూసివేయడంతో రైతులు దిక్కుతోచక లబోదిబోమంటున్నారని తెలిపారు.

ఈ ఖరీఫ్‌లో దాదాపు 40వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేయగా, 33,75,000 క్వింటాళ్ల ఉల్లి దిగుబడి వచ్చిందని, గిట్టుబాటు ధరల్లేక రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. పంటను గ్రామ సచివాలయాల్లో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో జరగడం లేదని తెలిపారు.

ఉల్లి కొనుగోలుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి, ఉల్లి పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments