Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులను లాకప్‌లో పెట్టిన ఘటనపై సుమోటోగా కేసు

Webdunia
ఆదివారం, 19 మార్చి 2023 (12:39 IST)
బాలల హక్కులకు ఎవరు భంగం కలిగించినా శిక్షార్హులవుతారని ఏపీ బాలల హక్కుల రక్షణ కమిషన్‌ సభ్యుడు జె.రాజేంద్రప్రసాద్‌ హెచ్చరించారు. 'కౌన్సెలింగ్‌ పేరిట లాకప్‌లో విద్యార్థులు' అనే పేరుతో ఓ పత్రికలో ప్రచురితమైన వార్తా కథనంపై ఆయన స్పందించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. జరిగిన ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
 
విద్యార్థులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లడం ప్రాథమికంగా తప్పంటూ సంబంధిత ఉపాధ్యాయులను మందలించారు. దీనిపై కమిటీని నియమించి విచారణ చేయిస్తామని చెప్పారు. డీఈవో, కలెక్టర్‌తోనూ మాట్లాడతానన్నారు. ముగ్గురు బాధితులను విచారణకు పిలవగా వారిలో ఇద్దరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాలేదన్నారు. దీంతో ఒకరినే విచారించామన్నారు.
 
బాలల పట్ల ఎలా వ్యవహరించాలనే విషయమై ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుడు జగ్గారావుకు పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో రాజేంద్రప్రసాద్‌ సమావేశమయ్యారు.
 
మరోవైపు, విద్యార్థులను పోలీస్‌స్టేషన్లో పెట్టించిన ఘటనలో ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు తాఖీదులు జారీచేశారు. విద్యార్థులను ఉపాధ్యాయులు దండించడమే కాకుండా పోలీసుస్టేషనులో అప్పగించిన సంగతి విదితమే. ఇలా ఎందుకు చేశారో కారణాలు తెలపాలంటూ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.జగ్గారావు, ఉపాధ్యాయులు విజయ్‌ప్రకాశ్‌, గణపతి, సీహెచ్‌ సుధాకర్‌రెడ్డికి ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జి డీఎస్‌ఈవో ఎన్‌వీ రవిసాగర్‌ శనివారం షోకాజ్‌ నోటీసులు జారీచేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments