Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫణి పెనుతుఫాన్ ఉత్తరాంధ్ర వైపు దూసుకొచ్చి....

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (09:42 IST)
వేసవిలో వచ్చే తుఫానులు అల్లకల్లోలం సృష్టిస్తుంటాయి. ఈసారి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఫణి సోమవారంనాటికి మచిలీపట్నానికి 840 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై వుంది. ఈ తుఫాను మే 1 సాయంత్రం వరకు ఈశాన్య దిశగా పయనించి ఉత్తరాంధ్ర వైపుకి అతి సమీపంలోకి దూసుకు వస్తుంది.
 
ఈ కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖల్లో మే 3న భారీవర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. అంతేకాదు ఒకటిరెండు చోట్ల మే 4న అతి భారీవర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపారు.
 
కాగా ఫణి పెనుతుఫాన్ ఉత్తరాంధ్రకు సమీపంలోకి వచ్చి ఆ తర్వాత తన దిశ మార్చుకుని ఒడిషా వైపుకి పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మొత్తమ్మీద ఫణి తుఫాను ముప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేనట్టే. ఐతే సముద్రం అల్లకల్లోలంగా వుంటుంది కనుక చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments