Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొదలైన అగ్ని నక్షత్రం.. వేసవి పరాకాష్ట.. నడిరోడ్లపై ఎండమావులు.. ఈ 25 రోజులూ ప్రాణగండమే

మండువేసవికి పరాకాష్టగా భావించే అగ్ని నక్షత్రం దక్షిణాదిన తమిళనాడులో ప్రారంభమైంది. గత నెలరోజులుగా ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు అసలు పరీక్ష గురువారం నుంచే ప్రారంభమైంది. ఇప్పటినుంచి మే చివరివరకు అంటే 25 రోజులపాటు ప్రజలు అసాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని చె

Webdunia
శనివారం, 6 మే 2017 (03:15 IST)
మండువేసవికి పరాకాష్టగా భావించే అగ్ని నక్షత్రం దక్షిణాదిన తమిళనాడులో ప్రారంభమైంది. గత నెలరోజులుగా ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు అసలు పరీక్ష గురువారం నుంచే ప్రారంభమైంది. ఇప్పటినుంచి మే చివరివరకు అంటే 25 రోజులపాటు ప్రజలు అసాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం ముందస్తు హెచ్చరిక చేసింది. మరో మూడువారాలపాటు మధ్యాహ్నం 12 గంటల నంచి సాయంత్రం 3 గంటలవరకు ప్రజలు ఇళ్లు వదిలి బయట తిరగడాన్ని సాధ్యమైనంతర వరకు మానుకోవాలని సూచించింది. 
 
తమిళనాడులో కత్తెర కార్తి అనే అగ్ని నక్షత్రం ప్రారంభమైనా, తెలుగు రాష్ట్రాల్లో కూడా గత రెండు రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం 5 గంటల సమయంలో కూడా భయంకరమైన ఉక్కపోత శరీరాలను దహిస్తోంది. నగరాల్లోని పలు ప్రధాన రోడ్లలో జనసంచారం పలుచబడింది. ప్రధాన రహదారుల్లో ఎండమావులు దర్శనమివ్వడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తప్పనిసరిగా ఇళ్లనుంచి బయటకు వచ్చే ప్రజలు ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నారు.  
 
ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఈ మూడువారాలు ఇల్లు దాటి బయటకు వచ్చారంటే వెంట బ్యాగులో చన్నీళ్ల బాటిల్ పెట్టుకుని రావడం భానుడి భగభగలను కాపాడుకునే ఉత్తమ మార్గం. భయంకరమైన ఉక్కపోతలో శరీరానికి కావలసిన మోతాదులో నీరు అందివ్వక పోవడం వల్లే దేశంలో వేసవి మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. చన్నీళ్లు, మజ్జిగ పుచ్చుకోవడం ఒక్కటే వేసవి తాపాన్ని కాచుకునే మార్గం. 
 
ముఖ్యంగా ఈ మూడువారాలు పగలు మనది కాదని గమ్మునుంటే, బయటకు రాకుండా నీడపట్టున ఉంటే ఒంటికీ మంటికీ కూడా మంచిదని వైద్యుల సూచన.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments