Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల ఆశీర్వాదంతో విజయం: పవన్‌కల్యాణ్

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (08:26 IST)
రాష్ట్రంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. పరిషత్‌ ఎన్నికల్లో గెలిచిన జనసైనికులకు పవన్‌కల్యాణ్ అభినందనలు తెలిపారు. వైసీపీ నేతల దాష్టీకాలను తట్టుకుని నిలబడ్డారని ఆయన కొనియాడారు.

కడియంలంకలో జనసేన జెండా ఎగురడం ఖాయమన్నారు. దీనిని అడ్డుకోవాలని అధికార పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. వివాదం చేయాలని చూస్తే తానే స్వయంగా ఇక్కడకి వస్తానని ఆయన ప్రకటించారు.

సతీష్ అనే వ్యక్తిని పోలీసులే చితక బాదటం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. అయ్యప్ప అనే వ్యక్తిపై వైసీపీ గూండాలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ విషయాలలో పోలీసు అధికారులు ఎందుకు స్పందించ లేదన్నారు.

జరుగుతున్న వరుస ఘటనలపై  ఛీఫ్ సెక్రటరీ, ఎన్నికల కమిషనర్, డీజీపీలు స్పందించాలన్నారు. స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పవన్‌కల్యాణ్ డిమాండ్ చేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments