Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయం వాకింగ్ వెళ్తూ వెళ్తూ.. రైల్వే ట్రాక్‌పై నిల్చుని సెల్ఫీ.. రైలు కింద పడి విద్యార్థి మృతి!

సోషల్ మీడియా ప్రభావంతో సెల్ఫీ పిచ్చి బాగా ముదిరిపోతోంది. ఎక్కడిపడితే అక్కడ సెల్ఫీలు దిగేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం ప్రస్తుతం యువత ఫ్యాషనైపోయింది. అయితే సెల్ఫీలతో ప్రాణాపాయం ఉన్న సంగతిన

Webdunia
గురువారం, 21 జులై 2016 (07:33 IST)
సోషల్ మీడియా ప్రభావంతో సెల్ఫీ పిచ్చి బాగా ముదిరిపోతోంది. ఎక్కడిపడితే అక్కడ సెల్ఫీలు దిగేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం ప్రస్తుతం యువత ఫ్యాషనైపోయింది. అయితే సెల్ఫీలతో ప్రాణాపాయం ఉన్న సంగతిని ఏ మాత్రం గుర్తించుకోవట్లేదు. సెల్ఫీలతో ప్రమాదముందని తెలిసినా.. లైకులు, షేర్ల కోసం ప్రస్తుత యువత పాకులాడుతోంది. తాజాగా సెల్ఫీ పిచ్చితో మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
రైల్వే ట్రాక్‌పై నిల్చుని సెల్ఫీకి ప్రయత్నించి ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. రైల్వే ట్రాక్‌పై సెల్ఫీకి యత్నించిన ఇంజనీరింగ్ విద్యార్థి బాషా రైలు ఢీకొనడంతో దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలం పెరవాడ గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
ఉదయం వాకింగ్ వెళ్లిన బాషా ఎదురుగా వస్తున్న రైలు పక్కన సెల్ఫీతో పోటో దిగేందుకు యత్నించాడు. కానీ రైలు వేగాన్ని గమనించలేకపోయిన ఆ యువకుడు.. సెల్ఫీ మోజులో పడి రైలు వేగాన్ని గుర్తించకపోవడంతో దానికిందే పడి ప్రాణాలు కోల్పోయాడు. కాగా మృతి చెందిన బాషా ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్నాడు. ఇతడు.. దొర్నిపాడు మండలం వాసిగా గుర్తించారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments