Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెన్ను వివాదం ఓ విద్యార్థిని ప్రాణం తీసింది... ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకేసింది..

సెల్వి
శనివారం, 16 నవంబరు 2024 (20:19 IST)
పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో విషాదం చోటుచేసుకుంది. పెన్ను విషయంలో స్నేహితురాలితో ఏర్పడిన స్వల్ప వివాదం తలెత్తిన క్రమంలో ఓ విద్యార్థిని ఏకంగా భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
 
ఆంధ్రప్రదేశ్​లోని బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన జెట్టి అనూష నరసరావుపేటలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉంటోంది. 
 
పెన్ను విషయంలో తీవ్ర మనస్తాపానికి గురైన అనూష హాస్టల్‌ భవనంలోని నాలుగో ఫ్లోర్​ నుంచి ఒక్కసారిగా కిందకు దూకింది. హాస్టల్‌ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని అనూష మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.
 
మరోవైపు సంగారెడ్డి మండలం కొత్లాపూర్‌లోని బీసీ సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాలలో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. 9వ తరగతి చదువుతున్న బాలికను లింగంపల్లికి చెందిన స్వాతిగా గుర్తించారు. 
 
శనివారం ఉదయం హాస్టల్‌లోని సీలింగ్‌కు ఉరి వేసుకుని కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments