Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్లన సాగర్ మంటలు.. హరీశ్ రావు రోడ్లపై వంటలు చేయలేదా?: రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రకుమార్

తెలంగాణ రాష్ట్రంలో మల్లన సాగర్ మంటలు చెలరేగాయి. ఈ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా భూములు కోల్పోతున్న రైతులు ఆందోళనబాట పట్టారు. వీరిపై పోలీసులు తన లాఠీని ఝుళిపించారు. వీరికి విపక్షాలు అండగ

Webdunia
బుధవారం, 27 జులై 2016 (10:43 IST)
తెలంగాణ రాష్ట్రంలో మల్లన సాగర్ మంటలు చెలరేగాయి. ఈ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా భూములు కోల్పోతున్న రైతులు ఆందోళనబాట పట్టారు. వీరిపై పోలీసులు తన లాఠీని ఝుళిపించారు. వీరికి విపక్షాలు అండగా నిలిచాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి.
 
అయితే, ఈ మల్లన్ సాగర్ భూనిర్వాసితుల మహాధర్నా నిర్వహించారు. ఇందులో రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రకుమార్ పాల్గొని ప్రసంగిస్తూ ప్రాజెక్టుల పేరిట రైతులను బిచ్చగాళ్లుగా మారుస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్, హరీశ్ రావులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. 
 
భూముల కోసం రైతులను బలవంతపెట్టి సంతకాలు తీసుకుంటే ప్రాజెక్టులు పూర్తికావని ఆయన అన్నారు. నిరసనలు తెలిపే హక్కు ప్రజలకు ఉందని, దాన్ని అడ్డుకోరాదని సూచించారు.
 
తెలంగాణ ఉద్యమం బలంగా సాగుతున్న వేళ, హరీశ్ రావు రహదారులను దిగ్బంధం చేసి వంటలు వండుకుని తినలేదా? వాళ్లు చేస్తే కరెక్ట్, భూములు పోతాయన్న భయంతో ప్రజలు అదే పని చేస్తే తప్పా? అని పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి చంద్రకుమార్ ప్రశ్నించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments