Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 5న రాష్ట్ర బంద్ : లెఫ్ట్ పిలుపు

Webdunia
ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (09:39 IST)
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌  ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తిప్పికొట్టేందుకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక మార్చి 5న  బంద్‌కు ఇచ్చిన పిలుపును బలపరుస్తున్నట్లు వామపక్ష పార్టీలు తెలిపాయి. బంద్‌ను జయప్రదం చేయాలని అన్ని తరగతుల ప్రజానీకాన్ని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 
 
ఆనాడు 32 మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌కు అమ్మడానికి పూనుకోవడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు అమలు విషయంలో మోసం చేసిన బీజేపీ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో ప్రజలకు మరోసారి ద్రోహం చేస్తోందని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును మళ్లీ అదే స్ఫూర్తితో నిలబెట్టుకోవడమే మార్గమన్నారు. 
 
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మార్చి 5న బంద్‌కు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపునిచ్చిందని తెలిపారు. కాగా, మార్చి 5న బంద్‌కు అన్నివర్గాల మద్దతు కూడగట్టే పనిలో ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కమిటీ నిమగ్నమైంది. 
 
శనివారం విశాఖలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబులతోపాటు పలువురు నాయకులను కమిటీ ప్రతినిధులు కలిసి బంద్‌కు సహకరించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments