Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలంలో చిరుతపులి కోసం బోను.. చిక్కిన ఎలుగుబంటి

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2023 (11:04 IST)
శ్రీశైలంలోని అటవీ ప్రాంతంలో శిఖరేశ్వరం సమీపంలో సంచరిస్తున్న క్రూర జంతువులను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ఒక బోనును ఏర్పాటు చేశారు. ఈ బోనులో ఎలుగుబంటి చిక్కింది. దీన్ని శుక్రవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. గత రెండు రోజుల నుంచి శిఖరం సమీపంలో ఎలుగు సంచరించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శిఖరేశ్వరం సమీపంలో మూడు బోన్లను ఏర్పాటు చేశారు. శ్రీశైలం పరిధిలో చిరుత కూడా సంచరించడంతో అటవీశాఖ అధికారులు, భక్తులను డిప్యూటీ డైరెక్టర్ అలాంగ్‌ చాంగ్‌ తెరాన్‌ అప్రమత్తం చేశారు. దీంతో ఎలుగుబంటి బోనులో చిక్కింది. తిరుపతిలో జరిగిన ఘటనల దృష్ట్యాలో శ్రీశైలంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు. అయినప్పటికీ భక్తులు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుని రాకపోకలు సాగించాలని అధికారులు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments