Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలంలో చిరుతపులి కోసం బోను.. చిక్కిన ఎలుగుబంటి

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2023 (11:04 IST)
శ్రీశైలంలోని అటవీ ప్రాంతంలో శిఖరేశ్వరం సమీపంలో సంచరిస్తున్న క్రూర జంతువులను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ఒక బోనును ఏర్పాటు చేశారు. ఈ బోనులో ఎలుగుబంటి చిక్కింది. దీన్ని శుక్రవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. గత రెండు రోజుల నుంచి శిఖరం సమీపంలో ఎలుగు సంచరించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శిఖరేశ్వరం సమీపంలో మూడు బోన్లను ఏర్పాటు చేశారు. శ్రీశైలం పరిధిలో చిరుత కూడా సంచరించడంతో అటవీశాఖ అధికారులు, భక్తులను డిప్యూటీ డైరెక్టర్ అలాంగ్‌ చాంగ్‌ తెరాన్‌ అప్రమత్తం చేశారు. దీంతో ఎలుగుబంటి బోనులో చిక్కింది. తిరుపతిలో జరిగిన ఘటనల దృష్ట్యాలో శ్రీశైలంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు. అయినప్పటికీ భక్తులు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుని రాకపోకలు సాగించాలని అధికారులు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments