Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడ వెళుతున్న శ్రీకృష్ణా ట్రావెల్స్ బస్సు బోల్తా

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (10:35 IST)
హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న శ్రీకృష్ణా ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలోని ఆకుపాముల జాతీయ రహదారిపై ఈ ఉదయం అదుపు తప్పి బోల్తా పడింది.

ప్రమాదంలో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 
 
బస్సు బోల్తా పడిన సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉన్నారు. అద్దాలు పగలకొట్టుకుని బయటకు వచ్చిన కొందరు ప్రయాణికులు బస్సులో చిక్కుకున్న మిగతా వారిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. అతి వేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసును పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments