Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్ని ఆలయాలు తెరుస్తారు, చిత్తూరు జిల్లాలో ఆ ఆలయం తప్ప?

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (19:16 IST)
చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి. వేలాదిమంది భక్తులు ఆలయాలకు ప్రతిరోజు వచ్చి వెళుతుంటారు. లాక్‌డౌన్ కారణంగా 80 రోజుల పాటు ఆలయాలను మూసివేశారు. తిరుమల శ్రీవారి ఆలయం మాత్రమే తెరిచి ఉంచి భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించడం లేదు. 
 
అయితే తాజాగా కేంద్రం లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ఆలయాలను తెరిచేందుకు సిద్ధమైంది రాష్ట్రప్రభుత్వం. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు దేవదాయశాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు. దీంతో చిత్తూరు జిల్లాలోని ఆలయాలన్నీ తెరుచుకోనున్నాయి.
 
కానీ ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయం మాత్రం మూతపడే ఉంటుంది. అందుకు కారణం కరోనా. కంటోన్మెంట్ జోన్లో శ్రీకాళహస్తి ఆలయం ఉండటంతో ఆలయాన్ని తెరవకూడదన్న నిర్ణయాన్ని తీసుకున్నార దేవస్థానం అధికారులు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు.
 
దీంతో శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం 8వ తేదీ తెరిచే అవకాశమే లేదు. శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలు చాలా ఫేమస్. అయితే అలాంటి ఆలయాన్ని లాక్‌డౌన్ సడలింపుల తరువాత కూడా తెరవరన్న విషయం తెలుసుకున్న భక్తుల తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే ఆలయాన్ని ఎప్పుడు తిరిగి తెరుస్తారా అన్న విషయాన్ని మాత్రం దేవస్థానం అధికారులు స్పష్టం చేయలేదు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments