Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తాకోడళ్లను చంపేశారు.. కారణం ఏమైవుంటుంది..?

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (12:16 IST)
ఆధునిక యుగంలో నేరాల సంఖ్య పెరిగిపోతుంది. టెక్నాలజీ అరచేతుల్లో వుండటంతో మానవీయ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా శ్రీకాకుళంలో అత్తాకోడళ్లు దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ హత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలోని బొందిలీపురంలో నివసించే మెహరున్నీశా (37), ఆమె అత్త జురాబాయ్ 965) గురువారం హత్యకు గురయ్యారు. ఇంట్లో వంట పనిచేస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు లోపలికి చొరబడి వీరిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. మెహరున్నీషా భర్త అబ్దుల్ ఖుదీష్ జిలానీ వ్యాపార నిమిత్తం బయటకెళ్లడం.. పిల్లలు స్కూల్‌కు వెళ్లడంతో.. ఆ సమయంలో ఇంట్లో ఇద్దరే ఉన్నారు. హత్యానంతరం దుండగులు ఇంటికి తాళం వేసి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. 
 
దుండగులకు ఇంటి తాళం ఎలా దొరికి ఉంటుంది?.. లేకపోతే ఆ కుటుంబంతో పరిచయం ఉన్నవారే ఈ హత్యకు పాల్పడ్డారా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఇంటికి తాళం వేసివుండటంతో బాబాయ్ ఇంటి నుంచి డూప్లికేట్ తాళం తీసుకొచ్చిన మెహరున్నీశా కుమారులు జాఫర్‌(15), దిషన్‌(12) షాకయ్యారు. అమ్మ, నాన్నమ్మ హత్యకు గురవడం చూసి కేకలు పెట్టారు. స్థానికులు మెహరున్నీశా భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments