Webdunia - Bharat's app for daily news and videos

Install App

దెయ్యం పట్టుకుందని.. మసీదు ముందు పీక కోసుకుని..?

దెయ్యం పట్టుకుందని ఓ యువకుడు మసీదు ముందు పీక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలోని సోంపేట పట్టణంలోని మసీదు ముందు ఓ యువకుడు పీక కోసుకుని బలవన్

Webdunia
శుక్రవారం, 26 జనవరి 2018 (14:00 IST)
దెయ్యం పట్టుకుందని ఓ యువకుడు మసీదు ముందు పీక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలోని సోంపేట పట్టణంలోని మసీదు ముందు ఓ యువకుడు పీక కోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడు లావేరు మండలం, బుడుమూరు పంచాయతీ బొంతువలస గ్రామానికి చెందిన అల్లంశెట్టి సురేష్‌గా పోలీసులు గుర్తించారు. 
 
ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సురేష్.. ఓ అద్దె ఇంట్లో వున్నాడు. ఓ రోజు బాబాయ్‌కి ఫోన్ చేసి తన ఆరోగ్యం బాగోలేదని దెయ్యం పట్టినట్లుందని తెలిపాడు. దీంతో ఆయ‌న సురేష్‌ దగ్గరికొచ్చి ధైర్యం చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ త‌న‌ను ముట్టుకోవ‌ద్ద‌ని, ఒకవేళ ముట్టుకుంటే ఆత్మహత్య చేసుకొంటానని సురేష్‌ బెదిరించాడు.
 
ఈ విష‌యం తెలుసుకున్న సురేష్ తండ్రి కేశవరావు అర్థరాత్రే స్వగ్రామం నుంచి బయలుదేరి తన కుమారుడు ఉంటోన్న‌ సోంపేటకు వ‌చ్చాడు. అయితే, సురేష్ గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో షాక్ తిన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments