Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళంలో పిడుగుపాటుకు నలుగురి దుర్మరణం

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (22:24 IST)
శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని వంగర మండలంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, సీతంపేట మండలంలో ఒకరు చనిపోయారు. వంగర మండలంలోని మరణించిన వారిలో అచ్యుతరావు అనే పదో తరగతి విద్యార్థి కూడా ఉన్నారు. 
 
నిజానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలో సూర్యతాపం తారాస్థాయిలోవున్నది. భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. అయితే, సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఫలితంగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో పిడుగులు పడడంతో నలుగురు మరణించారు. 
 
మృతుల్లో అచ్యుతరావు అనే పదో తరగతి విద్యార్థి, మరో ముగ్గురు పశువుల కాపరులు ఉన్నారు. వీరంతా పశువులు మేపడానికి వెళ్లి పిడుగుపాటుకు గురయ్యారు. పైగా, మృతులంతా నిరుపేదలని ప్రభుత్వమే వీరిని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments