Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు... ఏపీలో కేఈ కృష్ణమూర్తి, టీలో కేసీఆర్..!

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (09:18 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వాడవాడలా  రామాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయంలో ప్రభుత్వం అధికారిక వేడుకలకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హాజరవుతున్నారు. 
 
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో సీతారాముల కల్యాణోత్సవంలో టీఎస్ సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఛైత్రశుధ్ద నవమి అభిజిత్ లగ్నమందు శ్రీరామకల్యాణం నిర్వహించనున్నారు. 
 
ఇదేవిధంగా ఉత్తరాంధ్రలోని రామతీర్థంలో కూడా ఆంధ్రా ప్రభుత్వం అధికారికంగా వేడుక నిర్వహించనుంది. ఒంటిమిట్టలో శ్రీరామునికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పట్టువస్త్రాలు సమర్పించనుండగా, రామతీర్థంలో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 
 
ఇక భద్రాచలంలో రామయ్యకు కేసీఆర్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. కాగా, ఏప్రిల్ 2న జరిగే కల్యాణోత్సవంలో గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు పాల్గోనున్నారు. దేశంలోని ప్రధాన దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీరామకల్యాణాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు దేవాలయాలకు చేరుకుంటున్నారు.

కేసీఆర్‌ లాంచ్ చేసిన కేసీఆర్‌ సినిమాలోని తెలంగాణ తేజం పాట

శ్రీవారిని దర్శించుకున్న డింపుల్ హయాతీ.. బాబోయ్ కాళ్ళు కాలిపోతున్నాయి..

అనుష్క తరహా పాత్రలు. యాక్షన్ , మార్షల్ ఆర్ట్స్ రోల్స్ చేయాలనుంది : కృతి శెట్టి

తన తండ్రి 81 వ జయంతి సందర్బంగా గుర్తుచేసుకున్న మహేష్ బాబు

ఫోన్ ట్యాపింగ్ వల్లనే సమంత కాపురం కూలిపోయింది: బూర సంచలన వ్యాఖ్యలు

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

జెన్ జెడ్ ఫ్యాషన్-టెక్ బ్రాండ్ న్యూమీ: హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్‌లో అతిపెద్ద రిటైల్ స్టోర్‌ ప్రారంభం

మామిడి పండ్లు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Show comments