Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మెట్రో రైల్ పనులు ఢిల్లీ మెట్రో రైల్‌కు .. అందుకే తెరపైకి శ్రీధరన్‌!

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (15:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్టణంలలో చేపట్టనున్న మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ఢిల్లీ మెట్రో రైల్ సంస్థకు అప్పగించారు. అందుకే రంగంలోకి ఢిల్లీ మెట్రో రైల్ రూపశిల్పి శ్రీధరన్‌ను రంగంలోకి దించారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్టులను రాబోయే మూడున్నరేళ్ళలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అంటే శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నది ఏపీ ప్రభుత్వ భావనగా ఉంది. 
 
కాగా, ఇప్పటికే విశాఖ, వీజీటీఎం (విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి) పరిధిలో చేపట్టిన ఈ రెండు మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణాల బాధ్యతలను ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్‌కు అప్పగించారు. ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీలోని తన కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఢిల్లీ మెట్రో రూపశిల్పి శ్రీధరన్‌తో భేటీ అయ్యారు. 
 
రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణానికి సలహాదారుగా ఉండాల్సిందిగా శ్రీధరన్‌ను కోరడంతో ఆయన దానికి సమ్మతించారు. మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని శ్రీధరన్‌ను సీఎం కోరారు. మూడున్నర ఏళ్లలో రెండు మెట్రో ప్రాజెక్టులను పూర్తి చేసే అంశంపై ఇరువురు చర్చించారు. ఈ చర్చల్లో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు కూడా పాల్గొన్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments