Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోదా ముఖ్యం కాదు.. ప్రాజెక్టులే ప్రాణం : వెంకయ్య

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2015 (17:13 IST)
ప్రత్యేక హోదా ముఖ్యం కాదు. దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. ఏమిటి లాభం.. అయినా వెనుకబడే ఉన్నాయి. ఆ రాష్ట్రాలు ప్రస్తుతం ప్రాజెక్టుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్రాజెక్టులే ప్రాణమని తెలిపారు. శనివారం నెల్లూరు జిల్లా పొదలకూరులో రూ.3.80 కోట్లతో నిర్మించనున్న 30 పడకల ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. 
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కంటే ముందు ప్రాజెక్టులను సాధించుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. ఆందోళన చెందకుండా ప్రాజెక్టులను తీసుకు రావడంలో అందరూ కలిసి వస్తే రాష్ట్రం పరుగులు పెడుతుందన్నారు. చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఉన్నప్పటికీ ఆర్థిక స్వావలంబన లేక చతికిల పడ్డాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. 
 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరవు, పొదలకూరు ఎమ్మెల్యే గోవర్థన్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ, ఎమ్మెల్సీ చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments