Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు: పిల్లలను దత్తత తీసుకుంటే 180 రోజులు సెలవు

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (10:53 IST)
ఏపీ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. 11వ పే రివిజన్‌ కమిషన్‌ (పీఆర్‌సీ) సిఫార్సుల ఆధారంగా పిల్లల దత్తత, పిల్లల సంరక్షణ, వికలాంగులకు స్పెషల్‌ క్యాజువల్‌ సెలవులు, పలు వ్యాధులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షమీర్‌ సింగ్‌ రావత్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
 
పిల్లలను దత్తత తీసుకున్న ఉద్యోగి 180 రోజుల వరకూ సెలవు తీసుకోవచ్చు. పిల్లల సంరక్షణ సెలవులను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ పీఆర్సీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి తన సర్వీసు కాలంలో ఎప్పుడైనా ఈ సెలవులను వినియోగించుకోవచ్చు. ఈ అవకాశం ఒంటరి (అవివాహితుడు, విడాకులు పొందిన వారు, భార్య చనిపోయిన వారు) పురుషులకూ వర్తిస్తుంది. 
 
వికలాంగులైన ఉద్యోగులు తమ కృత్రిమ అవయవాలను మార్చుకునేందుకు ఏటా ఏడు రోజుల పాటు స్పెషల్‌ క్యాజువల్‌ సెలవులను పొందవచ్చు. హైరిస్క్‌ వార్డుల్లో పనిచేసే నర్సింగ్‌ ఉద్యోగులు కూడా ఈ సెలవులు తీసుకోవచ్చు. ఇక ప్రాణాంతక వ్యాధులకు చికిత్స పొందుతున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్ కోసం రైలు పైన నిలబడి రిస్కీ స్టంట్ చేసిన తేజ సజ్జా

షష్టిపూర్తి లోని రాజేంద్ర ప్రసాద్ పాత్ర బయట కనిపించదు : దర్శకుడు పవన్ ప్రభ

Naveen Polishetty : అనగనగా ఒక రాజు గా నవీన్‌ పొలిశెట్టి ఊరికోసం ఏం చేశాడు?

Keneeshaa: ట్రోల్స్‌తో తలనొప్పి.. అత్యాచార బెదిరింపులు కూడా.. కఠినమైన చర్యలు తప్పవ్.. కెనీషా

Tollywood: టాలీవుడ్ నిర్మాతలు ఆడే గేమ్‌కు పవన్ కళ్యాణ్ చెక్ - స్పెషల్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

నా ప్రాణమా, నన్నల్లుకునే పున్నమి సౌందర్యమా

రిలేషన్‌షిప్ పెట్టుకోగానే అమ్మాయిలు లావుగా మారిపోతారు, ఎందుకని?

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

తర్వాతి కథనం
Show comments