ప్రయాణికులకు శుభవార్త.. విజయవాడ రైల్వే స్టేషన్‌లో మసాజ్ సెంటర్

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (08:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య రాజధానిగా ఒకపుడు గుర్తింపును సొంతం చేసుకున్న విజయవాడ నగరంలో ప్రధానమైన రైల్వే జంక్షన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ జంక్షన్ మీదుగా ప్రతి రోజూ వందల సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఈ రైల్వే స్టేషన్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. తాజాగా ప్రయాణికుల కోసం మసాజ్ సెంటర్‌ను ప్రారంభించారు. అయితే, ఇది అమ్మాయలు మసాజ్ చేసే సెంటరు కాదు. రోబోటిక్ మసాజ్ సెంటర్. 
 
ఈ అత్యాధునిక మసాజ్ సెంచటర్ ద్వారా ప్రయాణికులు అతి తక్కువ రుసుంతో బాటీ, ఫుట్ మసాజ్ సేవలు పొందొచ్చు. ఒకటో నంబరుఫ్లాట్‌ఫాంపై ఏర్పాటుచేసిన ఈ రెండు రోబోటిక్ బాడీ మసాజ్ కుర్చీలు, ఒక ఫుట్ మసాజ్ కుర్చీ అందుబాటులో ఉన్నాయి.
 
దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజరు శివేంద్ర మోహన్ సోమవారం వీటిని ప్రారంభించారు. బాడీ మసాజ్‌కు రూ.60, ఫుట్ మసాజ్‌కు రూ.30 చొప్పు రుసుం వసూలు చేస్తారు. కాగా, ఈ రైల్వే స్టేషన్‌లో ఇటీవల ఫిష్ స్పా, హ్యాండ్ లూమ్స్ అండ్ క్రాఫ్ట్స్, మొబైల్ యాక్ససరీలకు సంబంధించిన ఔట్ లెట్స్‌ను ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments