Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు శుభవార్త.. విజయవాడ రైల్వే స్టేషన్‌లో మసాజ్ సెంటర్

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (08:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య రాజధానిగా ఒకపుడు గుర్తింపును సొంతం చేసుకున్న విజయవాడ నగరంలో ప్రధానమైన రైల్వే జంక్షన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ జంక్షన్ మీదుగా ప్రతి రోజూ వందల సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఈ రైల్వే స్టేషన్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. తాజాగా ప్రయాణికుల కోసం మసాజ్ సెంటర్‌ను ప్రారంభించారు. అయితే, ఇది అమ్మాయలు మసాజ్ చేసే సెంటరు కాదు. రోబోటిక్ మసాజ్ సెంటర్. 
 
ఈ అత్యాధునిక మసాజ్ సెంచటర్ ద్వారా ప్రయాణికులు అతి తక్కువ రుసుంతో బాటీ, ఫుట్ మసాజ్ సేవలు పొందొచ్చు. ఒకటో నంబరుఫ్లాట్‌ఫాంపై ఏర్పాటుచేసిన ఈ రెండు రోబోటిక్ బాడీ మసాజ్ కుర్చీలు, ఒక ఫుట్ మసాజ్ కుర్చీ అందుబాటులో ఉన్నాయి.
 
దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజరు శివేంద్ర మోహన్ సోమవారం వీటిని ప్రారంభించారు. బాడీ మసాజ్‌కు రూ.60, ఫుట్ మసాజ్‌కు రూ.30 చొప్పు రుసుం వసూలు చేస్తారు. కాగా, ఈ రైల్వే స్టేషన్‌లో ఇటీవల ఫిష్ స్పా, హ్యాండ్ లూమ్స్ అండ్ క్రాఫ్ట్స్, మొబైల్ యాక్ససరీలకు సంబంధించిన ఔట్ లెట్స్‌ను ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments