Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు శుభవార్త.. విజయవాడ రైల్వే స్టేషన్‌లో మసాజ్ సెంటర్

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (08:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య రాజధానిగా ఒకపుడు గుర్తింపును సొంతం చేసుకున్న విజయవాడ నగరంలో ప్రధానమైన రైల్వే జంక్షన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ జంక్షన్ మీదుగా ప్రతి రోజూ వందల సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఈ రైల్వే స్టేషన్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. తాజాగా ప్రయాణికుల కోసం మసాజ్ సెంటర్‌ను ప్రారంభించారు. అయితే, ఇది అమ్మాయలు మసాజ్ చేసే సెంటరు కాదు. రోబోటిక్ మసాజ్ సెంటర్. 
 
ఈ అత్యాధునిక మసాజ్ సెంచటర్ ద్వారా ప్రయాణికులు అతి తక్కువ రుసుంతో బాటీ, ఫుట్ మసాజ్ సేవలు పొందొచ్చు. ఒకటో నంబరుఫ్లాట్‌ఫాంపై ఏర్పాటుచేసిన ఈ రెండు రోబోటిక్ బాడీ మసాజ్ కుర్చీలు, ఒక ఫుట్ మసాజ్ కుర్చీ అందుబాటులో ఉన్నాయి.
 
దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజరు శివేంద్ర మోహన్ సోమవారం వీటిని ప్రారంభించారు. బాడీ మసాజ్‌కు రూ.60, ఫుట్ మసాజ్‌కు రూ.30 చొప్పు రుసుం వసూలు చేస్తారు. కాగా, ఈ రైల్వే స్టేషన్‌లో ఇటీవల ఫిష్ స్పా, హ్యాండ్ లూమ్స్ అండ్ క్రాఫ్ట్స్, మొబైల్ యాక్ససరీలకు సంబంధించిన ఔట్ లెట్స్‌ను ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments