Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు - కాచిగూడ రైలు మార్చి 28వ తేదీ వరకు రద్దు

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (10:20 IST)
వివిధ రకాలైన మరమ్మతులు కారణంగా ఆదివారం నుంచి గుంటూరు - కాచిగూడ ప్రాంతాల మధ్య నడిచే రైలును రద్దు చేశారు. ఈ నెల 28వతేదీ వరకు ఈ రైలు సేవలు అందుబాటులో ఉండవు. కాచిగూడ - గుంటూరు రైలును ఆదివారం నుంచి మార్చి ఒకటో తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే, కాచిగూడ - మెదక్ రైలును రేపటి నుంచి మార్చి ఒకటోతేదీ వరకు, మెదక్ - కాచిగూడ రైలును రేపటి నుంచి మార్చి ఒకటో తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు తెలిపింది. 
 
అలాగే, సికింద్రాబాద్ - గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైలు దొనకొండ - గంటూరు మధ్య ఈ నెల 18వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రద్దు చేశారు. గుంటూరు - డోన్ రైలు 12-28, డోన్ - గుంటూరు రైలును 13 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు రద్దు చేశారు. గుంటూరు - తిరుపతి 19 నుంచి 28 వరకు, తిరుపతి - గుంటూరు రైలును, గుంటూరు - మార్కాపురం స్టేషన్ల మధ్య రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 
 
వీటితోపాటు మచిలీపట్నం - కర్నూలు సిటీ రైలును 14, 16, 18, 21, 23, 25, 28 తేదీల్లో, కర్నూలు సిటీ - మచిలీపట్నం రైలును 15, 17, 19, 22, 24, 26, మార్చి ఒకటో తేదీల్లో రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు - సికింద్రాబాద్ ఎక్స్‌‍ప్రెస్ రైలును దొనకొండ - గంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments