Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు - కాచిగూడ రైలు మార్చి 28వ తేదీ వరకు రద్దు

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (10:20 IST)
వివిధ రకాలైన మరమ్మతులు కారణంగా ఆదివారం నుంచి గుంటూరు - కాచిగూడ ప్రాంతాల మధ్య నడిచే రైలును రద్దు చేశారు. ఈ నెల 28వతేదీ వరకు ఈ రైలు సేవలు అందుబాటులో ఉండవు. కాచిగూడ - గుంటూరు రైలును ఆదివారం నుంచి మార్చి ఒకటో తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే, కాచిగూడ - మెదక్ రైలును రేపటి నుంచి మార్చి ఒకటోతేదీ వరకు, మెదక్ - కాచిగూడ రైలును రేపటి నుంచి మార్చి ఒకటో తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు తెలిపింది. 
 
అలాగే, సికింద్రాబాద్ - గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైలు దొనకొండ - గంటూరు మధ్య ఈ నెల 18వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రద్దు చేశారు. గుంటూరు - డోన్ రైలు 12-28, డోన్ - గుంటూరు రైలును 13 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు రద్దు చేశారు. గుంటూరు - తిరుపతి 19 నుంచి 28 వరకు, తిరుపతి - గుంటూరు రైలును, గుంటూరు - మార్కాపురం స్టేషన్ల మధ్య రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 
 
వీటితోపాటు మచిలీపట్నం - కర్నూలు సిటీ రైలును 14, 16, 18, 21, 23, 25, 28 తేదీల్లో, కర్నూలు సిటీ - మచిలీపట్నం రైలును 15, 17, 19, 22, 24, 26, మార్చి ఒకటో తేదీల్లో రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు - సికింద్రాబాద్ ఎక్స్‌‍ప్రెస్ రైలును దొనకొండ - గంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments