Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ప్రయాణికులకు అలెర్ట్ : 12 నుంచి 22 వరకు అనేక రైళ్లు రద్దు

రైల్వే ప్రయాణికులకు అలెర్ట్ : 12 నుంచి 22 వరకు అనేక రైళ్లు రద్దు
ఠాగూర్
ఆదివారం, 10 మార్చి 2024 (12:40 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ ఒక హెచ్చరిక చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అనేక రైళ్లను రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వే జారీ చేసిన ప్రకటన ప్రకారం ఈ నెల 12, 15, 16, 19 తేదీలలో కాచిగూడ, మహబూబ్ నగర్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లు షాద్ నగర్ మీదుగా వెళ్లవని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ బ్లాక్ కారణంగా వాటిని వేరే మార్గంలో నడిపిస్తున్నట్టుగా వివరించారు. కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్టు పేర్కొన్నారు. 
 
ఈ నెల 20వ తేదీన హౌరా - శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను నంద్యాల, ఎర్రగుంట్ల మీదుగా నడిపిస్తున్నట్టు చెప్పారు. డోన్, గుత్తి స్టేషన్ల మధ్య తాత్కాలికంగా స్టాపును రద్దు చేశారు. ఈ నెల 22వ తేదీ నుంచి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం - హౌరా, పూరి - యశ్వంత్‌పూర్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లను గుత్తి పోర్టు, ఎర్రగుంట్ల, నంద్యాల మీదుగా మళ్లిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments