Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం తల్లిని నదిలో తోసేసిన కిరాతక కొడుకు.. రక్షించిన స్థానికులు!

Webdunia
గురువారం, 30 అక్టోబరు 2014 (11:11 IST)
కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్నతల్లిని కుందూనదిలోకి తోసేసి హత్య చేసేందుకు ప్రయత్నించాడో కిరాతక కన్నకొడుకు. ఈ దారుణానికి అక్కడి స్థానికులు గమనించడంతో చేతికి చిక్కకుండా పారిపోయాడు. అయితే, ఆ స్థానికలు వెంటనే నదిలోకి దిగి ఆమెను రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి... ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
 
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తిని తన పేరిట రాయాలని గత కొంత కాలంగా కొడుకు.... కన్న తల్లిని వేధిస్తూ వచ్చాడు. ఇదే విషయంపై తల్లీ కొడుకులకూ ఇంట్లో గొడవలు కూడా చోటు చేసుకున్నట్టు సమాచారం. అయితే ఈ రోజు ఉదయం పని ఉంది రమ్మంటూ తనను బయటకు తీసుకువెళ్లాడని.... కుందూనది వద్దకు చేరుకోగానే... ఒక్కసారిగా తనను నదిలోకి తోసేశాడని ఆమె పోలీసులకు వెల్లడించింది. పోలీసులు పరారైన కోడుకు కోసం గాలిస్తున్నారు.  

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments