Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లీ కొడుకుల మధ్య మనస్పర్ధలు.. వారం రోజులుగా ఆహారం లేదు..

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (17:14 IST)
మనస్పర్ధల కారణంగా 25 ఏళ్ల క్రితం భర్తను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇప్పుడు కూమారులు కూడా దూరం పెట్టడంతో ఏ గతీ లేక చెట్ల పుట్ల వెంట తిరిగుతోంది ఓ మహిళ. వారం రోజులుగా ఇదే పరిస్థితి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని పాత పాల్వంచ గ్రామంలో చోటుచేసుకుంది. శివపార్వతికి స్థానిక శ్రీనివాస కాలనీకి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. 
 
ఆ తర్వాత కుటుంబంలో తలెత్తిన కలహాల కారణంగా 25 ఏళ్ల క్రితం భర్త నుండి విడాకులు తీసుకుని ఇద్దరు కుమారులతో పుట్టింటికి చేరుకుంది. కొడుకులకు ఇంకా వివాహం కాలేదు. అయితే ఈ మధ్య తల్లీ కొడుకుల మధ్య కూడా వివాదాలు వచ్చాయి. అప్పటి నుండి కుటుంబీకులు ఆమెను సరిగ్గా చూసుకోలేదు. దాంతో ఆవేదనకు గురైన వృద్ధురాలు ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోయింది. 
 
గ్రామ శివారులోని పొలంలో ఉన్న తమ పాత ఇంటి శిథిలాల వద్ద తలదాచుకుంది. వారం రోజులుగా ఆహారం సరిగ్గా లేకపోవడంతో శరీరం నీరసించింది. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు శివపార్వతి కుమారులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లీ కొడుకులను ఇంటికి పంపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments