Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి బాలినేని వ‌ద్ద‌కు గుప్తా... సుభానీ ఓవ‌ర్ యాక్ష‌న్ వ‌ల్లే అంతా!

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (13:03 IST)
ప్ర‌కాశం జిల్లా ఒంగోలులో వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా అనుకున్న‌ట్లే ప్లేట్ ఫిరాయించాడు. త‌నపై మంత్రి బాలినేని శ్రీనివాస్ దాడి చేయించ‌డం ఏమిట‌ని ఎదురు ప్ర‌శ్నించాడు. ముఖ్య‌మంత్రి వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పుట్టిన రోజు సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్రమానికి సుబ్బారావు గుప్తా హాజ‌ర‌య్యాడు. ఇది మంత్రి బాలినేని ఏర్పాటు చేయ‌డం ఇక్క‌డ విశేషం. 
 
 
విజయవాడలో మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి దగ్గర ప్రత్యక్షమైన సోమిశెట్టి సుబ్బారావు గుప్తా త‌న‌పై ఎటువంటి దాడి జ‌రగ‌లేద‌నే రీతిలోనే వ్య‌వ‌హ‌రించాడు. ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలలో మంత్రితోపాటు కేక్ కట్ చేసి సుబ్బారావు గుప్తా, సీఎంకు శుభాకాంక్షలు తెలిపాడు. మంత్రి బాలినేని తనపై దాడి చేయించార‌నే వార్తలను సుబ్బారావు గుప్తా ఖండించాడు.  
 
 
సుభాని అనే వ్యక్తి ఓవరాక్షన్ ఇంత రచ్చకు కారణం అని గుప్తా చెప్పాడు. తాను మొదటి నుండి రాజకీయాలలో మంత్రి బాలినేని వెంట వున్నాన‌ని, తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఉన్న పరిస్థితులను బట్టి చేశాన‌ని చెప్పాడు. ఈ వ్యాఖ్యల వెనుక ఎవరూ లేర‌ని, పార్టీని బతికించుకోవాల‌నే  ఆకాంక్షతో తాను ఇది చేశాన‌ని, ఇందులో ఎటువంటి దురుద్దేశ్యం లేద‌న్నాడు. 
 
 
మరో 29ఏళ్లపాటు సీఎం జగన్ సీఎం గా ఉండాల‌ని, త‌నపై దాడి విషయాన్ని పెద్ద ఇస్యూ  చేయకుండా ఉండాలని మనవి చేసుకుంటున్నాన‌ని గుప్తా చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments