Webdunia - Bharat's app for daily news and videos

Install App

90:10 నిష్పత్తిలో రాష్ట్రానికి నిధులు రావాలి: ఎంపీ గల్లా జయదేవ్

విభజన వల్ల ఎన్నో ఆస్తులు కోల్పోయామని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. మిగతా దక్షిణ భారత రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు ఏపీని కేంద్రం ఆదుకోవాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని నాడు రాజ్యసభలో

Webdunia
ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (16:27 IST)
విభజన వల్ల ఎన్నో ఆస్తులు కోల్పోయామని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. మిగతా దక్షిణ భారత రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు ఏపీని కేంద్రం ఆదుకోవాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని నాడు రాజ్యసభలో ప్రధాని హామీ ఇచ్చిన విషయాన్ని గల్లా జయదేవ్ ప్రస్తావించారు. 
 
రాష్ట్ర విభజన సమయానికి రాష్ట్రం విద్యుత్ లోటుతో, లోటు బడ్జెట్‌లో ఉందని, ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం 90:10 నిష్పత్తిలో రాష్ట్రానికి నిధులు రావాలని, తలసరి ఆదాయం ప్రకారం చూసుకుంటే రాష్ట్రానికి చాలా రావాల్సి ఉందని గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు.
 
ఏపీకి న్యాయం చేయాలని పార్లమెంట్‌లోనూ అన్ని పక్షాలు డిమాండ్ చేశాయని గుర్తు చేశారు. ఏపీకి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని అందరికీ అర్థమైందని గల్లా జయదేవ్ తెలిపారు. ఏపీలో జాతీయ రహదారుల కోసం లక్ష కోట్ల రూపాయలు చేశామని కేంద్ర ప్రభుత్వం అంటోందని.. కానీ ఖర్చు చేసింది కేవలం రూ.5,900 కోట్లు మాత్రమేనని గల్లా గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments