Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయలచెరువుకు చిన్న లీకేజీ, అపాయం లేదు కానీ..?

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (19:28 IST)
గత రెండు రోజుల నుంచి చిత్తూరు జిల్లాలోని రాయలచెరువుకు పడిన గండి ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. ఏ క్షణమైనా చెరువు కట్ట తెగిపోతుందని గ్రామస్తులు ఊర్లకు ఊర్లు ఖాళీ చేశారు. 0.9 టిఎంసి సామర్థ్యం ఉన్న రాయలచెరువులో అధికంగా నీటి సామర్థ్యం ఉండడంతో కట్ట తెగే అవకాశముందన్న ఆందోళన నెలకొంది.

 
దీంతో రాయలచెరువు చుట్టుపక్కల ఉన్న సుమారు 16 గ్రామ ప్రజలను హుటాహుటిన అధికారులు తరలించారు. మూడు వేల మందికి పైగా గ్రామస్తులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే టీటిడి సహకారంతో తిరుచానూరులోని పద్మావతి నిలయం కూడా పునరావాస కేంద్రంగా మార్చుకున్నారు.

 
ప్రస్తుతం రాయల చెరువు వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న ఇసుక వేసిన తర్వాత గండి ఏమాత్రం పూడకపోవడంతో ఈరోజు మధ్యాహ్నం సిమెంటు ఇసుక కలిపిన మిశ్రమాన్ని చెరువుకి పడిన గండి వద్ద కూలీలు వేస్తున్నారు.

 
సిమెంటు ఇసుకతో ఉన్న మిశ్రమం గండి దగ్గర వేయడం వల్ల గట్టిగా మారిపోయి నీరు బయటకు వెళ్లే ఉధృతి తగ్గుతుందన్న నమ్మకంతో అధికారులు ఉన్నారు. మూడు వందల మందికి పైగా కూలీలు శ్రమించి ప్రస్తుతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

 
ప్రస్తుతానికైతే రాయల చెరువు వద్ద ఆందోళనకరమైన వాతావరణం కనిపిస్తోంది. వర్షం పడుతున్న పరిస్థితుల్లో వరద ఉధృతి పెరిగి చెరువు కట్ట ఏ క్షణమైనా తెగే అవకాశం ఉందన్న ఆందోళన నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments