Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

ఠాగూర్
బుధవారం, 27 నవంబరు 2024 (22:25 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం తొమ్మిది కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయనకు అరెస్టు భయం పట్టుకోవడంతో అజ్ఞాతంలోకి జారుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆచూకీ కనుగొనేందుకు ఆరు పోలీసు బృందాలు తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి. 
 
గత వైకాపా పాలనలో అధికార పార్టీ నేతల అండ చూసుకుని నోరు పారేసుకున్న వారిలో వర్మ ఒకరు. ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేశ్‌లపై సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులను వర్మ పెట్టారు. వీటిపై గత వైకాపా ప్రభుత్వంలోనే పలువురు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసులు నమోదు చేయలేదు. ఇపుడు ప్రభుత్వం మారడంతో వర్మపై రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం తొమ్మిది కేసులు నమోదయ్యాయి. 
 
అయితే, ఓ కేసులో విచారణకు రావాలంటూ ఒంగోలు పోలుసులు ఆయనకు స్వయంగా నోటీసులు అందజేసినప్పటికీ ఆయన హాజరుకాలేదు. అప్పటి నుంచి ఆయనకు అరెస్టు భయం పట్టుకుంది. దీంతో ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించారు. పైగా, అరెస్టు చేస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారనే భయం పట్టుకుంది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. 
 
మరోవైపు, వర్మ కోసం ఆరు పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. తమిళనాడు, కేరళ, కర్నాటకలలో వర్మ ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌ ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments