Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోల మృతి?

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (16:04 IST)
గ్రేహౌండ్స్ ద‌ళాలు, మావోయిస్టుల‌కు కాల్పులు చోటుచేసుకున్నాయి. విశాఖ మన్యంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోలు మృతి చెందినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. కొయ్యూరు మండ‌లం మంప పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని తీగ‌ల‌మెట్ట వ‌ద్ద బుధవారం ఈ ఎదురు కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టులు ఉన్నార‌న్న స‌మాచారంతో మంప పోలీస్‌స్టేసన్ ప‌రిధిలో పోలీసులు కూంబింగ్ చేప‌ట్టారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.
 
అయితే ఎదురు కాల్పుల్లో ఎంతమంది మావోయిస్టులు చనిపోయారన్న దానిపై పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. సంఘటనా స్థలం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండటంతో పూర్తి వివరాలు తెలియడానికి కాస్త సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు. 
 
ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ కొన‌సాగుతోంద‌ని తెలిపారు. ఘ‌ట‌నాస్థలిలో ఏకే- 47 తుపాకులు లభ్యమయ్యాయి. ఈ ఘటన తర్వాత మావోయిస్టు అగ్రనేత‌లు త‌ప్పించుకున్నార‌న్న స‌మాచారంతో భద్రతా దళాలు హెలికాప్టర్ సాయంతో గాలింపు చ‌ర్యలు చేప‌ట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments