శిరీషపై ఎస్ఐ అత్యాచారం చేయలేదు సరే.. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నట్టు?
హైదరాబాద్ బ్యూటీషియన్ శిరీషపై కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అత్యాచారానికి పాల్పడలేదనీ, శిరీష మరణంలో ఎలాంటి మిస్టరీ లేదనీ ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెల
హైదరాబాద్ బ్యూటీషియన్ శిరీషపై కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అత్యాచారానికి పాల్పడలేదనీ, శిరీష మరణంలో ఎలాంటి మిస్టరీ లేదనీ ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. అయితే, శిరీషపై అత్యాచారం చేయని ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఎందుకు సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్నదీ ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.
బ్యూటీషియన్ శిరీష మృతి కేసు వివరాలను సీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం మీడియాకు వివరించారు. ఈ కేసులో ఏ1 నిందితుడు శ్రవణ్, ఏ2 నిందితుడు రాజీవ్లుగా పేర్కొన్న ఆయన.. వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. బ్యూటీషియన్ శిరీషతో రాజీవ్కు వివాహేతర సంబంధం ఉందనీ, మధ్యలో బెంగుళూరుకు చెందిన తేజశ్విని రాజీవ్ను ప్రేమించడం, ఆమెకు శిరీషతో రాజీవ్కు ఉన్న సంబంధం తెలిసిందన్నారు.
వీరిమధ్య ఏర్పడిన మనస్పర్థలకు ఓ పరిష్కారం కనుగొనేందుకు రాజీవ్ నిర్ణయించి, తన స్నేహితుడు శ్రవణ్ను సంప్రదించాడు. శ్రవణ్కు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి స్నేహితుడు కావడంతో ఆయన వద్దకు వెళ్లారు. ఇందుకోసం రాజీవ్ తన కారులో శిరీష, శ్రవణ్లతో కలిసి కుకునూర్పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి వద్దకు వెళ్లారని చెప్పారు. కుకునూరుపల్లిలోని ఎస్సై ప్రభాకర్ రెడ్డి క్వార్టర్స్కు వారు ముగ్గురూ వెళ్లి పార్టీ చేసుకున్నారని అన్నారు.
వారు ఎస్సై ప్రభాకర్ దగ్గరికి ముఖ్యంగా తేజస్విని విషయంపై చర్చించడానికి వెళ్లారని అన్నారు. రూంలో నలుగురూ కలిసి మద్యం తాగారని చెప్పారు. సిగరెట్ తాగడం కోసం రాజీవ్, శ్రవణ్ బయటకు వెళ్లిన సమయంలో రూంలోనే ఉన్న ప్రభాకర్ రెడ్డి శిరీషతో రెడ్డి అసభ్యంగా ప్రవర్తించారని మహేందర్ రెడ్డి అన్నారు.
తాను అలాంటిదాన్ని కాదని, శిరీష అభ్యంతరం వ్యక్తం చేసి, ఏడ్చిందని చెప్పారు. శిరీషపై ప్రభాకర్ రెడ్డి అత్యాచారం చేయలేదని స్పష్టం చేశారు. తాను ఒక్కతే గదిలో మిగిలిపోయానని భయపడిన శిరీష తన భర్తకు లొకేషన్ను షేర్ చేసిందని అన్నారు. ఈ ఘటనతో శిరీష్ తీవ్ర మనస్తాపం చెందిందని చెప్పారు. రూంలో అరుపులు వినిపిస్తుండటంతో శ్రవణ్, రాజీవ్ రూం వద్దకు వచ్చి చూశారని అన్నారు. శిరీష్ అరుపులతో భయపడి పోయిన ఎస్సై ప్రభాకర్ రెడ్డి అరవకూడదని చెప్పాడని అన్నారు. తలో రూంలోకి వచ్చిన రాజీవ్, శ్రవణ్లు శిరీషను తెల్లవారు జామున 2.30 గంటలకు ఎక్కించుకుని వెళ్లిపోయారని తెలిపారు. హైదరాబాద్లోని ఫోటో స్టూడియోకు చేరుకున్న తర్వాత శిరీష ఒంటరిగా గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్టు సీపీ తెలిపారు. అయితే, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయం మాత్రం గోప్యంగానే ఉంది.