Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంగలపూడి అనితకు షోకాజ్ నోటీసులు.. టీడీపీ చిర్రుబుర్రు

Webdunia
గురువారం, 9 మార్చి 2023 (19:05 IST)
ఏపీ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనితకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వంగలపూడి అనితకు పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు షోకాజ్ నోటీసులు ఇచ్చారంటూ ప్రచారం జరుగుతోంది. 
 
మహిళా దినోత్సవం సందర్భంగా లోకేష్ పాదయాత్రలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనిత చేసిన వ్యాఖ్యలకు గాను ఈ నోటీసు ఇచ్చారని ఓ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ ప్రెస్ మీట్‌లో 2024లో జగన్‌‌ను మళ్ళీ సీఎం చేయడానికి మహిళలందరూ సిద్ధం కావాలనే ఉద్దేశంతో అనిత మాట్లాడటంతో తెలుగు దేశం పార్టీకి చెందిన మహిళ కార్యకర్తలు, మహిళ నాయకుల్లో ఒకింత షాక్‌కు గురైయ్యారని తెలిసింది. దీంతో ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 
 
ఇక అనిత చేసిన సదరు వ్యాఖ్యలపై 48 గంటల్లోపు వివరణ ఇవ్వాలనే నోటీసు నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ నోటీసు వైకాపా కుట్ర అంటూ టీడీపీ ఫైర్ అయ్యింది. 
 
ఇదంతా వైకాపా కుట్ర అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడింది. వైసీపీ మీడియా సృష్టించిన ఫోర్జరీ లేఖ ఇదంటూ... ఏం జగన్ రెడ్డి! ఇదేనా నీ రాజకీయం? అంటూ టీడీపీ ఘాటుగా స్పందించింది. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments