Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంగలపూడి అనితకు షోకాజ్ నోటీసులు.. టీడీపీ చిర్రుబుర్రు

Webdunia
గురువారం, 9 మార్చి 2023 (19:05 IST)
ఏపీ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనితకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వంగలపూడి అనితకు పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు షోకాజ్ నోటీసులు ఇచ్చారంటూ ప్రచారం జరుగుతోంది. 
 
మహిళా దినోత్సవం సందర్భంగా లోకేష్ పాదయాత్రలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనిత చేసిన వ్యాఖ్యలకు గాను ఈ నోటీసు ఇచ్చారని ఓ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ ప్రెస్ మీట్‌లో 2024లో జగన్‌‌ను మళ్ళీ సీఎం చేయడానికి మహిళలందరూ సిద్ధం కావాలనే ఉద్దేశంతో అనిత మాట్లాడటంతో తెలుగు దేశం పార్టీకి చెందిన మహిళ కార్యకర్తలు, మహిళ నాయకుల్లో ఒకింత షాక్‌కు గురైయ్యారని తెలిసింది. దీంతో ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 
 
ఇక అనిత చేసిన సదరు వ్యాఖ్యలపై 48 గంటల్లోపు వివరణ ఇవ్వాలనే నోటీసు నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ నోటీసు వైకాపా కుట్ర అంటూ టీడీపీ ఫైర్ అయ్యింది. 
 
ఇదంతా వైకాపా కుట్ర అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడింది. వైసీపీ మీడియా సృష్టించిన ఫోర్జరీ లేఖ ఇదంటూ... ఏం జగన్ రెడ్డి! ఇదేనా నీ రాజకీయం? అంటూ టీడీపీ ఘాటుగా స్పందించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments