Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యో... బాబుకి కష్టాలు మొదలయ్యాయ్... ప్రజావేదిక వాళ్లక్కావాలట...

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (16:00 IST)
ఇది మామూలే. జనం అనుకునేవే. ఇంతకీ అదేంటయా అంటే... పాలనాధికారం వున్న పార్టీ ప్రతిపక్ష పార్టీ కోరే కోర్కెలను అంత తేలిగ్గా తీర్చదు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఇక అసలు విషయానికి వస్తే... ఉండవల్లిలో తను నివాసం వుంటున్న గృహానికి పక్కనే ప్రజావేదిక స్థలం ఖాళీగా వున్నదనీ, ఆ స్థలాన్ని తను అధికారికంగా వినియోగించుకునేందుకు అవకాశమివ్వాలని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి విన్నవించారు. దీనిపై జగన్ స్పందించలేదు. 
 
ఐతే ఇంతలో వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెనువెంటనే అదే ప్రజా వేదికను తమకే కేటాయించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యానికి విజ్ఞప్తి చేశారు. ఇలా చేస్తే సీఎం జగన్ నిర్వహించే సమావేశాలకు ఇబ్బందిలేకుండా వుంటుందనీ, ట్రాఫిక్ సమస్యలు కూడా రావంటూ పేర్కొన్నారాయన. ఒకేసారి అటు తెదేపా, ఇటు వైసీపీ రెండూ కూడా ప్రజావేదికను తమకు కావాలంటే తమకే కావాలంటూ అభ్యర్థించిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments