Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ దీక్ష జరిగితే.. మోడీ రాకకు ప్రమాదమని భగ్నం చేశారు: షర్మిల

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2015 (11:00 IST)
వైఎస్సార్సీపీ అధినేత జగన్ దీక్ష ఇలాగే జరిగితే, శంకుస్థాపన రోజు రాష్ట్ర ప్రజలు మోడీ అడ్డుకునే ప్రమాదం ఉందని.. సీఎం చంద్రబాబు భయపడ్డారని జగన్ సోదరి షర్మిల అన్నారు. జగన్ ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉందని షర్మిల చెప్పారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి ఆమె మాట్లాడుతూ, జగనన్న నీరసించిపోయాడని అన్నారు. కీటోన్స్ అదుపులోకి రావాలని వైద్యులు చెప్పినట్లు ఆమె వెల్లడించారు. 
 
షుగర్ లెవెల్స్ పడిపోయాయని, వాటిని అదుపులోకి తెచ్చేందుకు వైద్యులు కృషి చేస్తున్నారని షర్మిల అన్నారు. 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణ అవసరమని చెప్పారని, నేడు మొత్తం ఫ్లూయిడ్స్ ఎక్కిస్తామన్నారని, రేపు సెమీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తామని తెలిపారని షర్మిల చెప్పుకొచ్చారు. తర్వాత ఘనాహారం ఇవ్వడం కుదురుతుందన్నారు. 
 
జగనన్న ఇలాగే దీక్ష చేస్తే రాజధాని నిర్మాణ ఏర్పాట్లను ప్రజలు అడ్డుకునే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందిందని, అందుకే ఆయన దీక్షను రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేసిందని షర్మిల వెల్లడించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments