ప్రయాణికులకు విజ్ఞప్తి... ఈ నెల 16 వరకు రైళ్లు రద్దు

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2023 (10:44 IST)
విజయవాడ డివిజన్ పరిధిలో ఈ నెల 16వతేదీ వరకు అనేక రైళ్ళను రద్దు చేశారు. డివిజన్ నిర్వహణ పనుల్లో భాగంగా, వీటిని రద్దు చేశారు. ట్రాఫిక్ బ్లాక్ దృష్ట్యా పలు రైళ్ను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఈ నెల 16వ తేదీ వరకు ఈ పరిస్థితి కొనసాగనుంది. ఈ రైళ్ల వివరాలను పరిశీలిస్తే, 
 
విజయవాడ - తెనాలి (07279) రైలును రేపటి నుంచి 15వ తేదీ వరకు రద్దు చేయగా, తెనాలి - విజయవాడ (07575) రైలును కూడా అదే తేదీల్లో రద్దు చేశారు. బిట్రగుంట - విజయవాడ (07977/07978) రైలు 11వ తేదీ నుంచి 15 వరకు, బిట్రగుంట - చెన్నై సెంట్రల్ (17237/17238) రైలును రేపటి నుంచి 13 వరకు, విజయవాడ - ఒంగోలు (07461) రైలును 11వ తేదీ నుంచి 15 వరకు రద్దు చేశారు. 
 
ఒంగోలు - విజయవాడ (07576) రైలును 11వ తేదీ నుంచి 15 వరకు, విజయవాడ - గూడూరు (17259/17260) రైలును 11వ తేదీ నుంచి 15 వరకు, విజయవాడ - గూడూరు (07500) రైలును 11వ తేదీ నుంచి 15 వరకు, గూడూరు - విజయవాడ (07458) రైలును 12వ తేదీ నుంచి 16 వరకు, రాజమండ్రి - విశాఖపట్టణం (07466/07467) రైలును రేపటి నుంచి 15 వరకు, గుంటూరు - విశాఖపట్టణం (17239/17240) రైలును రేపటి నుంచి 16వరకు, విజయవాడ - విశాఖపట్టణం (22701/22702) రైలును 9, 10, 11, 13, 14 తేదీల్లో రద్దు చేశారు. 
 
రాజమండ్రి - విజయవాడ (07767) రైలును 9వ తేదీ నుంచి 15 వరకు, విజయవాడ - రాజమండ్రి (07459) రైలును రేపటి నుంచి 15 వరకు, మచిలీపట్టణం - విశాఖపట్నం (17219/17220) రైలును రేపటి నుంచి 16వరకు, విజయవాడ - గూడూరు (12743/12744) రైలును 11వ తేదీ నుంచి 16వరకు పూర్తిగా రద్దు చేశారు.
 
పాక్షికంగా రద్దు అయిన రైళ్లలో నర్సాపూర్ - గుంటూరు (17281/17282) రైలును రేపటి నుంచి 15 వరకు విజయవాడ - గుంటూరు మధ్య రద్దు చేయగా, మచిలీపట్టణం - విజయవాడ(07896) రైలును రేపటి నుంచి 15 వరకు విజయవాడ - రామవరప్పాడు మధ్య రద్దు చేశారు. అలాగే, విజయవాడ - మచిలీపట్నం (07769), నర్సాపూర్ - విజయవాడ(07883), విజయవాడ - మచిలీపట్టణం (07866), మచిలీపట్టణం - విజయవాడ(07770), విజయవాడ - భీమవరం జంక్షన్ (07283), మచిలీపట్టణం - విజయవాడ (07870), విజయవాడ - నర్సాపూర్ (07861) రైళ్లు అవే తేదీల్లో అవే రూట్ల మధ్య రద్దు చేశారు.
 
విజయవాడ, గుడివాడ - భీమవరం జంక్షన్ మీదుగా దారి మళ్లించిన రైళ్లలో ధన్‌బాద్ - అలెప్పి (13351) రైలును రేపటి నుంచి 13వరకు, హతియ - బెంగళూరు (12835) రైలును ఎల్లుండి, టాటా - బెంగళూరు (12889) రైలును 13వతేదీ, టాటా - యశ్వంత్‌పూర్ (18111) 12వ తేదీన, హతియ - ఎర్నాకుళం (22837) రైలును 9వ తేదీన దారిమళ్లిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments