Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుంభమేళా నుంచి తిరిగివస్తూ అనంతలోకాలకు చేరుకున్న ఏపీ భక్తులు! (Video)

ఠాగూర్
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (12:02 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతుంది. ఇందులో పాల్గొని పుణ్యస్నానం చేసి తిరిగి వస్తున్న ఏడుగురు ఏపీ భక్తులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
జబల్‌పూర్‌లోని సిహోరా సమీపంలో మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హైవే పైకి ట్రక్కు రాంగ్ రూట్‌లో రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలంలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు మినీ బస్సులో చిక్కుకునిపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికారులని వెల్లడించారు. అయితే, మృతి చెందిన వారి పేరు, ఊరు ఇతర వివరాలు తెలియాల్సివుంది. 
 
గ్వాటెమాలో లోయలోపడిన బస్సు - 55 మంది మృతి 
 
మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలా శివారు శివారుల్లో ఓ బస్సు వంతెన పైనుంచి లోయలోపడిపోయింది. ఈ ఘటనలో 55 మంది మృత్యువాతపడ్డారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రోగ్రెసో అనే ప్రాంతం నుంచి గ్వాటెమాలా నగరానికి వెళుతుండగా ఓ వంతెనపై పలు వాహనాలు ఢీకొనడేంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అగ్నిమాపకదళ శాఖ అధికారి ఎడ్విన్ విల్లాగ్రాన్ తెలిపారు. బస్సు 115 అడుగుల లోతులో మురుగునీటి ప్రవాహంలో పడిపోయినట్టు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన ఆ దేశ అధ్యక్షుడు బెర్నార్డో అరెవాలో మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments