Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా... రైలులో ఫొటో తీసుకుంటూ ఫార్మసి విద్యార్థి మృతి

విశాఖపట్టణంలో సెల్ఫీ సరదా ఓ ఫార్మసీ విద్యార్థి ప్రాణాలు తీసింది. అరకులోయ సందర్శన కోసం విశాఖ నుంచి పాసింజర్‌ రైలులో వెళ్తూ మొబైల్‌ ఫోన్‌తో సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ జారి, 150 అడుగుల లోతున ఉన్న నది

Webdunia
సోమవారం, 17 జులై 2017 (09:03 IST)
విశాఖపట్టణంలో సెల్ఫీ సరదా ఓ ఫార్మసీ విద్యార్థి ప్రాణాలు తీసింది. అరకులోయ సందర్శన కోసం విశాఖ నుంచి పాసింజర్‌ రైలులో వెళ్తూ మొబైల్‌ ఫోన్‌తో సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ జారి, 150 అడుగుల లోతున ఉన్న నదిలో పెద్ద బండరాయిపై పడటంతో ఈ విషాదం జరిగింది. హృదయ విదారకమైన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
 
గుంటూరు సమీపంలోని మలినేని లక్ష్మయ్య ఫార్మసీ కళాశాలకు చెందిన కొందరు విద్యార్థులు అరకులోయ అందాలను వీక్షించేందుకు శనివారం రాత్రి విశాఖపట్నం చేరుకున్నారు. ఆదివారం ఉదయం పాసింజర్‌ రైలులో అరకులోయ బయలుదేరారు. కబుర్లు చెప్పుకుంటూ, ఫొటోలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. గోపీరెడ్డి, మరో ఇద్దరు కలిసి బోగీ వాకిలి వద్ద నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్నారు.
 
కరకవలస - సిమిలిగుడ స్టేషన్ల మధ్య 87/17 కిలోమీటరు వద్ద గోస్తనీ నది ఉంది. ఈ నదిపై 150 అడుగుల ఎత్తులో రైలు వంతెన ఉంది. రైలు సరిగ్గా ఇక్కడకు వచ్చిన సమయంలో గోపీరెడ్డి పట్టుకోల్పోయి రైలులో నుంచి జారి నదిలో ఉన్న పెద్ద బండ రాయిపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మిగిలిన విద్యార్థులతోపాటు బోగీలో ఉన్న పలువురు చైను లాగి రైలును ఆపారు. సమాచారం అందుకున్న అరకు ఆర్‌పీఎఫ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయనగరం నుంచి జీఆర్‌పీ పోలీసులు వచ్చి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

బాలీవుడ్ సినిమాల కోసం తొందరపడట్లేదు.. నాగచైతన్య

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

తర్వాతి కథనం
Show comments