Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోశయ్య అల్లుడి కాలేజీలో సచివాలయం?!

Webdunia
గురువారం, 27 ఫిబ్రవరి 2020 (08:38 IST)
మిలినియం టవర్ లో సచివాలయం ఏర్పాటు కు అంతరాయం ఏర్పడడంతో జగన్ ప్రభుత్వం ప్రత్యామ్నాయం కోసం అడుగులేస్తోందా?... ఉగాది నాటికి అనుకున్నది పూర్తి చేసేయాలని తలపోస్తోందా?..

ఇందుకోసం మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అల్లుడితో డీల్ కుదుర్చుకుందా?.. అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు కోసం ప్రభుత్వం మరో 2 భవనాలను పరిశీలించినట్లు తెలిసింది.

అవి రోశయ్య కుటుంబానికి చెందినవి కావడం విశేషం. మంత్రి అవంతి శ్రీనివాస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలోనే ఉంది. విశాఖ నుంచి 20 కి.మీ. దూరంలో జాతీయ రహదారిని ఆనుకుని ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో పైడా గ్రూపునకు చెందిన 2 ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి.

అందులో ఒకటి పైడా ఇంజనీరింగ్‌ కాలేజీ కాగా.. మరొకటి కౌశిక్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ. సుమారుగా 30 ఎకరాల్లో ఇవి ఉన్నాయి. వీటి యజమాని రోశయ్య అల్లుడు పైడా కృష్ణప్రసాద్‌.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు భారీగా పేరుకుపోవడం, ప్లేస్‌మెంట్స్‌ ఆధారంగా విద్యార్థులు కాలేజీలను ఎంపిక చేసుకోవడంతో అడ్మిషన్లు బాగా తగ్గిపోయి నాలుగేళ్ల క్రితమే కౌశిక్‌ ఇంజనీరింగ్‌ కళాశాల మూతపడింది.

ప్రస్తుతం పైడా ఇంజనీరింగ్‌ కళాశాల మాత్రమే నడుస్తోంది. అందులో కూడా రెండేళ్ల నుంచి అడ్మిషన్లను నిలిపివేశారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల కోర్సులు పూర్తయిపోతే దానిని కూడా మూసివేస్తారని ప్రచారం జరుగుతోంది.

విజయసాయిరెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌, సీఎం అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, డీజీపీ గౌతంసవాంగ్‌ రెండ్రోజుల కింద విశాఖ వచ్చారు. ఈ భవనాలన్నింటినీ పరిశీలించి వెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments