పాఠశాలలు పూర్తి స్థాయిలో అభివృద్ధి: మంత్రి ఆదిమూలపు సురేష్

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (20:28 IST)
రాష్ట్రంలో బడి రూపు మార్చేందుకు ప్రజాప్రతినిధులంతా నడుం బిగించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కోరారు. నాడు - నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని, కార్యక్రమం విజయవంతం కోసం మంత్రులు,  ప్రజాప్రతినిధులు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.

పాఠశాలల రూపు మార్చటం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న నాడు - నేడు కార్యక్రమం లో భాగస్వాములమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలని ఆయన అన్నారు. గురువారం సచివాలయం లోని 5వ బ్లాక్ లో పలువురు మంత్రులు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం  జిల్లాల ఎమ్మెల్యేల తో  ఈ కార్యక్రమం పై సమావేశం జరిగింది. నాడు -నేడు పై వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ 
 
విద్యావ్యవస్థ లో తీసుకుంటున్న సంస్కరణలతో మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. నాడు - నేడు ను ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. నూతన నిర్మాణ పనుల భాద్యత పేరెంట్స్ కమిటీల ద్వారా జరుగుతుదన్నారు. బిల్లుల చెల్లింపు కోసం చెక్ లపై ఫీల్డ్ ఇంజనీర్, ప్రధానోపాధ్యాయులు తో పాటు పేరెంట్స్ కమిటీ లోని  ముగ్గురు సభ్యులను బాద్యులుగా చేస్తున్నామని వివరించారు.

దీనిపై కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఎక్కువమందిని భాగస్వాములు గా చేయటం వల్ల పనుల్లో అవాంతరాలు ఏర్పడతాయని సూచించారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ చెక్కుపై ఎక్కువమంది సంతకాలు ఉండటం ఇబ్బంది అయితే అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతి రూపాయికి లెక్క చూపే విధంగా పేరెంట్స్ కమిటీ రిజిస్టర్ మెయింటైన్ చేయాలన్నారు.

అంచనాలు రూపొందించే ఇంజనీర్లు కూడా పాఠశాలల లైఫ్ 75 సంవత్సరాలు ఉండే విధంగా డిజైన్ చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. మొదటి  విడతగా రాష్ట్రం లో 15, 715 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. పాఠశాలల్లో అభివృద్ధి చేసె మొత్తం 9 అంశాలను మంత్రి సురేష్ వివరించారు.

రాష్ట్ర స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా స్థాయి లో కలెక్టర్ చైర్మన్ గా కమిటీ ఉంటుందని తెలిపారు. కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు ఉపాధిహామీ నిధులతో అంచనాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆయా జిల్లాల్లో ఉన్న సమస్యలు, సలహాలు, సూచనలను మంత్రులు, ఎమ్మెల్యే లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అవసరమైన విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని మంత్రి సురేష్ చెప్పారు. సమావేశం లో నాలుగు  జిల్లాల ఎమ్మెల్యే లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments