Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచర్‌పై యాసిడ్ పోసిన వ్యక్తి.. ట్యుటోరియల్‌లో ట్యూషన్ చెప్తుండగా?

మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. హైదరాబాదులోని చింతల్‌లో ఓ టీచర్‌పై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లో

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (10:41 IST)
మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. హైదరాబాదులోని చింతల్‌లో ఓ టీచర్‌పై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 49 ఏళ్ల ఉప్పులూరి సూర్యకుమారి, లక్ష్మీనారాయణ దంపతులు స్థానిక పద్మానగర్‌ ఫేజ్‌-2లో నివసిస్తున్నారు.
 
సూర్యకుమారి చింతల్ కాకతీయ నగర్‌లోని సిద్ధార్థ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నారు. అదే ప్రాంతలో ఓ గది అద్దెకు తీసుకుని ట్యుటోరియల్ నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే గురువారం ట్యూషన్ చెబుతుండగా రాత్రి 7:30 గంటల సమయంలో ముఖానికి కర్చిఫ్ కట్టుకుని వచ్చిన  గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆమెపై యాసిడ్ పోసి పారిపోయాడు.
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సూర్యకుమారిని వెంటనే స్థానికులు కూకట్ పల్లిలోని రెమిడీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments