Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరు - 3 నెలల పాటు..

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2023 (20:38 IST)
గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వైకాపా నేతలు దాడి చేసి విధ్వంసం సృష్టించిన కేసులో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభికి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చెందిన అనుచరులు, వైకాపా నేతలు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కార్లకు నిప్పంటించారు. ఈ కేసులో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన పట్టాభిపైనే పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును పెట్టించి జైలుకు పంపించారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ కోర్టు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు పలు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. మూడు నెలల పాటు ప్రతి గురువారం పోలీస్ స్టేషన్‌లో హాజరై సంతకం చేయాలని ఆదేశించింది. అలాగే, రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వాలని షరతులు ఇస్తూ బెయిల్ మంజూరు చేసింది అలాగే, పట్టాభితో పాటు ఈ కేసులో అరెస్టు అయిన వారిని కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చుతూ పట్టాభికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments