Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌‌ బెయిల్ రద్దయ్యేనా? సుప్రీం కోర్టు నోటీసులు

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (13:40 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు భయం ప్రారంభమైంది. తమ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అదేసమయంలో సీబీఐతో పాటు జగన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. 
 
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌కు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణంరాజు ఇటీవల సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. జగన్ బెయిల్‌ను సీబీఐ, ఈడీ కూడా సవాల్ చేయడం లేదని రఘురామ తరపు న్యాయవాది ధర్మాసనం తెలిపింది. జగన్‌తో పాటు సీబీఐ ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. 
 
మరోవైపు, విచారణను తెలంగాణ హైకోర్టు నుంచి ఢిల్లీకి మార్చాలని తన పిటిషన్‌లో రఘురామ కోరారు. దీనని పిటిషన్‌‍కు జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ఈ సందర్భంగా బెయిల్ ఇపుడే రద్దు చేయాలా? అని ధర్మాసనం ప్రశ్నించగా, తొలుత నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియను చేపట్టాలని రఘురామరాజు తరపు న్యాయవాది కోర్టును కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

Ye Maaya Chesave: ఏ మాయ చేసావే రీ-రిలీజ్: ప్రమోషన్ కోసం చైతూ- సమంత కలిసి కనిపిస్తారా?

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments