Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటర్లకు భారీగా శ్రీవారి లడ్డూల పంపిణీ ... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (14:46 IST)
ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రకాలైన ఆకర్షణీయమైన ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఈ ప్రలోభాలు ఎక్కువగా చిత్తూరు జిల్లాలో సాగుతున్నట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, ఓటర్లను ఆకట్టు కునేందుకు కొందరు నగదు, ఆభరణాలు పంపిణీ చేస్తుండగా మరి కొందరు దేవుడి ప్రసాదం ఆశ చూపి ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీలో ఓ అభ్యర్థి  తనకు ఓటు వేసి గెలిపించాలంటూ గ్రామస్థులకు తిరుమల లడ్డూలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. 
 
శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం భక్తులు అవస్థలు పడుతుంటే.. తొండవాడలో ఓటు కోసం శ్రీవారి లడ్డూలను పంచడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి అడ్డు కట్టవేయాలని ఎన్నికల సంఘం ఆదేశించినా.. కిందిస్థాయి అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 
 
లో ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ చేసే ప్రభుత్వ వాహనంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పంచుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments