Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటర్లకు భారీగా శ్రీవారి లడ్డూల పంపిణీ ... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (14:46 IST)
ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రకాలైన ఆకర్షణీయమైన ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఈ ప్రలోభాలు ఎక్కువగా చిత్తూరు జిల్లాలో సాగుతున్నట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, ఓటర్లను ఆకట్టు కునేందుకు కొందరు నగదు, ఆభరణాలు పంపిణీ చేస్తుండగా మరి కొందరు దేవుడి ప్రసాదం ఆశ చూపి ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీలో ఓ అభ్యర్థి  తనకు ఓటు వేసి గెలిపించాలంటూ గ్రామస్థులకు తిరుమల లడ్డూలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. 
 
శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం భక్తులు అవస్థలు పడుతుంటే.. తొండవాడలో ఓటు కోసం శ్రీవారి లడ్డూలను పంచడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి అడ్డు కట్టవేయాలని ఎన్నికల సంఘం ఆదేశించినా.. కిందిస్థాయి అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 
 
లో ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ చేసే ప్రభుత్వ వాహనంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పంచుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments