Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా పండగ రాకుండానే సంక్రాంతి రైళ్లలో బెర్తులన్నీ ఫుల్!

ఠాగూర్
శనివారం, 14 సెప్టెంబరు 2024 (08:14 IST)
దసరా పండుగ రాకముందే సంక్రాంతి రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో నడిచే విశాఖ, గోదావరి, కోణార్క్, ఫలక్‌నుమా రైళ్లలో సంక్రాంతి బుకింగ్ శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభంకాగా ఈ రైళ్లలో స్లీపర్ క్లాస్ టిక్కెట్లన్నీ కేవలం ఐదంటే ఐదు నిమిషాల్లో పూర్తయ్యాయి. సాధారణంగా సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కరూ తమతమ సొంతూర్లకు వెళ్లేందుకు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అయితే, ఈ యేడాది సంక్రాంతి పండుగకు మరో నాలుగు నెలల సమయం ఉంది. కానీ, హైదరాబాద్ నగరం నుంచి ఏపీకి దారితీసే అన్ని రైళ్ళలో రిజర్వేషన్లన్నీ ఫుల్‌అయ్యాయి. 
 
వచ్చే యేడాది జనవరి 11వ తేదీన హైదరాబాద్ నుంచి వెళ్లే విశాఖ, గోదావరి, ఫలక్‌నుమా, కోణార్క్ తదితర రైళ్లకు శుక్రవారం ఉదయం 8 గంటలకు రిజర్వేషన్లు ప్రారంభంకాగా, కేవలం ఐదు నిమిషాల్లోనే అంటే 8.05 గంటలకే మొత్తం స్లీపర్ క్లాస్ బెర్తులు నిండిపోయాయి. ఆ తర్వాత ప్రయత్నించిన ప్రయాణికులకు తీవ్ర నిరాశ ఎదురైంది. సంక్రాంతి ఇంకా నాలుగు నెలల ముందే రిజర్వేషన్లు నిండిపోవడం ఇదే తొలిసారని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments