దసరా పండగ రాకుండానే సంక్రాంతి రైళ్లలో బెర్తులన్నీ ఫుల్!

ఠాగూర్
శనివారం, 14 సెప్టెంబరు 2024 (08:14 IST)
దసరా పండుగ రాకముందే సంక్రాంతి రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో నడిచే విశాఖ, గోదావరి, కోణార్క్, ఫలక్‌నుమా రైళ్లలో సంక్రాంతి బుకింగ్ శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభంకాగా ఈ రైళ్లలో స్లీపర్ క్లాస్ టిక్కెట్లన్నీ కేవలం ఐదంటే ఐదు నిమిషాల్లో పూర్తయ్యాయి. సాధారణంగా సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కరూ తమతమ సొంతూర్లకు వెళ్లేందుకు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అయితే, ఈ యేడాది సంక్రాంతి పండుగకు మరో నాలుగు నెలల సమయం ఉంది. కానీ, హైదరాబాద్ నగరం నుంచి ఏపీకి దారితీసే అన్ని రైళ్ళలో రిజర్వేషన్లన్నీ ఫుల్‌అయ్యాయి. 
 
వచ్చే యేడాది జనవరి 11వ తేదీన హైదరాబాద్ నుంచి వెళ్లే విశాఖ, గోదావరి, ఫలక్‌నుమా, కోణార్క్ తదితర రైళ్లకు శుక్రవారం ఉదయం 8 గంటలకు రిజర్వేషన్లు ప్రారంభంకాగా, కేవలం ఐదు నిమిషాల్లోనే అంటే 8.05 గంటలకే మొత్తం స్లీపర్ క్లాస్ బెర్తులు నిండిపోయాయి. ఆ తర్వాత ప్రయత్నించిన ప్రయాణికులకు తీవ్ర నిరాశ ఎదురైంది. సంక్రాంతి ఇంకా నాలుగు నెలల ముందే రిజర్వేషన్లు నిండిపోవడం ఇదే తొలిసారని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments