Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటో డ్రైవర్ డోర్ తీశాడు.. బైకుపై వెళ్లిన ఇద్దరు లారీ కింద పడిపోయారు.. చివరికి?

Webdunia
శనివారం, 27 ఏప్రియల్ 2019 (18:52 IST)
సంగారెడ్డి జిల్లా ఐడీఎల్ బొల్లారం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షేర్ ఆటో చేసిన పనికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సీసీటీవీలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం రికార్డు అయ్యింది. షేర్ ఆటో డ్రైవర్ వున్నట్టుండి డోర్ తెరిచాడు. దీంతో పక్కన వుస్తున్న బైకుకు తగిలింది. అంతే ఆ బైకు అదుపు తప్పింది. 
 
పక్కనే వెళ్తున్న లారీ కింద బైకులో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు పడిపోయారు. అంతే లారీ టైర్లకు బలైపోయారు. ఈ ఘటనను కళ్లారా చూసిన షేర్ ఆటో డ్రైవర్ ఏమీ తెలియనట్లు నడిచి వెళ్లాడు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని సైది రెడ్డి, లక్ష్మిగా గుర్తించారు.
 
వీరు చేర్యాల గ్రామస్తులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అజాగ్రత్తగా డోర్ తీయడంతో బైకును డోర్‌ను తాకి ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments