Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇసుకాసురులపై ఉక్కుపాదం... సీఎం చంద్రబాబు ఆదేశం

అమరావతి : ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఇసుక రీచ్ ల వద్ద గట్టి భద్రతతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పై పలు అంశాలపై సీఎం చంద్

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (20:09 IST)
అమరావతి : ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఇసుక రీచ్ ల వద్ద గట్టి భద్రతతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పై పలు అంశాలపై సీఎం చంద్రబాబునాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు.
 
రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉన్న 406 ఇసుక రీచ్‌ల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పక్క రాష్ట్రాలకు అక్రమంగా ఇసుక తరలించే వాహనాలను సీజ్ చేయాలని, వాహన యజమానులపై భారీ మొత్తంలో జరిమానాలు విధించాలన్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారి వివరాలను అందజేసిన వారికి ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. ప్రతి ఇసుక రీచ్ దగ్గర ప్రభుత్వ అధికారిని నియమించాలన్నారు. గనుల శాఖాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని దినేష్ కుమార్‌ను ఆదేశించారు.
 
రియల్ టైమ్ గవర్నెన్స్ చేపట్టిన సర్వే నివేదికలను సమీక్షించారు. మద్యం పాలసీ, విశాఖ భూకుంభకోణం, విశాఖపట్నంలో కొత్తగా చేపట్టిన పట్టాల పంపిణీ, మున్సిపాల్టీల్లోని టౌన్ ప్లానింగ్ పనితీరు, అన్న అమృతహస్తం పథకం అమలు తీరు, రైతుల బజార్ల పనితీరుపై సర్వే నివేదికలపై ముఖ్యమంత్రి సమగ్రంగా సమీక్షించారు. మద్యం పాలసీ అమలుపై 85 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తపర్చారని ఆర్.టి.జి అధికారులు తెలియజేశారు. ఇళ్ల మధ్య ఇంకా మద్యం షాపులు ఉన్నట్లయితే వాటిని తక్షణమే సుదూరు ప్రాంతాలకు తరలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

విశాఖపట్నంలో ఇటీవల చేపట్టిన పట్టాల పంపిణీపై అధిక శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని, అయితే పట్టాల కోసం పట్టాదారుల నుంచి 30 మంది అధికారులు లంచాలు అడిగినట్లు సర్వేలో వెల్లడైందని ఆర్.టి.జి అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఆయా అధికారుల నుంచి పట్టాదారులకు వారిచ్చిన నగదును వాపస్ ఇప్పించాలని సీఎం ఆదేశించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments