Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయాల పేరుతో చెత్త రాజకీయం చేస్తున్నారు : సజ్జల రామకృష్ణారెడ్డి

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (21:13 IST)
ఏపీలో ఆలయాల పేరుతో రాజకీయం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఏపీలో మతం పేరుతో ప్రతిపక్షాలు ఆడుకుంటున్నాయన్నారు. విగ్రహాలను ధ్వంసం చేయడం వల్ల వైసీపీకి ఏం ప్రయోజనమని సజ్జల ప్రశ్నించారు. రాష్ట్రంలో భద్రత లేని ఆలయాలనే టార్గెట్‌గా చేసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 
 
మతపరమైన అంశాలపై వైసీపీ ఎప్పుడైనా ఉద్యమం చేసిందా అని ప్రశ్నించారు. ‘‘ప్రజా సమస్యలు తీర్చడమే రాజకీయ పార్టీల పని. కుల, మతాలకు అతీతంగా ప్రభుత్వం పనిచేస్తోంది. చంద్రబాబు మతం ఆధారంగానే రాజకీయం చేస్తున్నారు. మత రాజకీయాలతో దివాలా తీసిన టీడీపీకి లాభం. బీజేపీకి దగ్గరయ్యేందుకే చంద్రబాబు ప్రయత్నం అని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. 
 
ఇకపోతే, ఏపీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 20 వరకు పొడిగించినట్లు సీఎం జగన్ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 39 శాతం ఇళ్ల స్థలాల పంపిణీ చేశామని సీఎం తెలిపారు. లబ్ధిదారుడికి నేరుగా ఇంటి పట్టా అందిస్తున్నామన్నారు. 
 
ఇళ్ల స్థలాల పెండింగ్‌ కేసులను కలెక్టర్లు పరిష్కరించాలని సీఎం సూచించారు. దరఖాస్తు పెట్టుకున్న 90 రోజుల్లో ఇళ్ల పట్టా ఇవ్వాలన్నారు. ప్రతి కాలనీ వెలుపల హైటెక్‌ రీతిలో బస్టాప్‌ తీర్చిదిద్దాలని జగన్ ఆదేశించారు. మ్యాపింగ్‌, జియో ట్యాగింగ్‌ కూడా ఏకకాలంలో పూర్తి చేయాలన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments