Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయాల పేరుతో చెత్త రాజకీయం చేస్తున్నారు : సజ్జల రామకృష్ణారెడ్డి

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (21:13 IST)
ఏపీలో ఆలయాల పేరుతో రాజకీయం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఏపీలో మతం పేరుతో ప్రతిపక్షాలు ఆడుకుంటున్నాయన్నారు. విగ్రహాలను ధ్వంసం చేయడం వల్ల వైసీపీకి ఏం ప్రయోజనమని సజ్జల ప్రశ్నించారు. రాష్ట్రంలో భద్రత లేని ఆలయాలనే టార్గెట్‌గా చేసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 
 
మతపరమైన అంశాలపై వైసీపీ ఎప్పుడైనా ఉద్యమం చేసిందా అని ప్రశ్నించారు. ‘‘ప్రజా సమస్యలు తీర్చడమే రాజకీయ పార్టీల పని. కుల, మతాలకు అతీతంగా ప్రభుత్వం పనిచేస్తోంది. చంద్రబాబు మతం ఆధారంగానే రాజకీయం చేస్తున్నారు. మత రాజకీయాలతో దివాలా తీసిన టీడీపీకి లాభం. బీజేపీకి దగ్గరయ్యేందుకే చంద్రబాబు ప్రయత్నం అని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. 
 
ఇకపోతే, ఏపీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 20 వరకు పొడిగించినట్లు సీఎం జగన్ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 39 శాతం ఇళ్ల స్థలాల పంపిణీ చేశామని సీఎం తెలిపారు. లబ్ధిదారుడికి నేరుగా ఇంటి పట్టా అందిస్తున్నామన్నారు. 
 
ఇళ్ల స్థలాల పెండింగ్‌ కేసులను కలెక్టర్లు పరిష్కరించాలని సీఎం సూచించారు. దరఖాస్తు పెట్టుకున్న 90 రోజుల్లో ఇళ్ల పట్టా ఇవ్వాలన్నారు. ప్రతి కాలనీ వెలుపల హైటెక్‌ రీతిలో బస్టాప్‌ తీర్చిదిద్దాలని జగన్ ఆదేశించారు. మ్యాపింగ్‌, జియో ట్యాగింగ్‌ కూడా ఏకకాలంలో పూర్తి చేయాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments