Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చిగడ్డి కోసం చెరకుతోటలోకి వెళితే... ఉన్మాది ఏం చేశాడో తెలుసా?

చిత్తూరు జిల్లా విజయపురం మండలంలో దారుణం జరిగింది. చెరకుతోటలోకి పచ్చిగడ్డి కోసం వెళ్లిన ఓ మహిళను ఓ ఉన్మాది చెరబట్టి బ్లేడుతో గొంతుకోశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే...

Webdunia
గురువారం, 27 జులై 2017 (08:51 IST)
చిత్తూరు జిల్లా విజయపురం మండలంలో దారుణం జరిగింది. చెరకుతోటలోకి పచ్చిగడ్డి కోసం వెళ్లిన ఓ మహిళను ఓ ఉన్మాది చెరబట్టి బ్లేడుతో గొంతుకోశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే...
 
జిల్లాలోని పన్నూరు ఆదిఆంధ్రవాడకు చెందిన పరశురాం అనే వ్యక్తి భార్య దేవి(34). ఈమె పచ్చిగడ్డి కోసం ఇంటికి సమీపంలోనే ఉన్న చెరకుతోటలోకి ఒంటరిగా వెళ్లింది. ఈమెను పన్నూరు దళితవాడకు చెందిన కుమార్‌(27) అనే ఉన్మాది గమనించి ఆమెకు కనిపించకుండా వెంబడించాడు. ఆ తర్వాత ఆమె చెరకుతోటలో పచ్చిగడ్డి కోస్తుంటే.. వెనుకవైపు నుంచి ఆమెపై బ్లేడుతో దాడి చేశారు. 
 
దీంతో ఆమె ప్రాణభయంతో ఒక్కసారి కేకలు వేయడంతో కుమార్ పారిపోయాడు. అయితే, ఈ ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన దేవిని చుట్టుపక్కలవారు గమనించి నగరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయాస్పత్రికి తీసుకెళ్లారు. 
 
కాగా, మూడేళ్ళ క్రితం సికిందరాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆరేళ్ళ చిన్నారిని కత్తితో గొంతుకోసి హత్య చేసిన కేసులో కుమార్ ప్రధాన ముద్దాయి. ఈ కేసులో అతనికి జైలుశిక్ష కూడా పడింది. అయితే, ఇపుడు జైలు నుంచి విడుదల చేశారా లేకపోతే జైలునుంచి తప్పించుకున్నాడా తెలియడం లేదు. 
 
తాజాగా దేవిపై జరిగిన దాడితో కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్థానికులు మాత్రం ఎపుడు ఎక్కడ తమపై దాడి చేస్తాడోనని భయబ్రాంతులకు గురవుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments