Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ హైకోర్టును చంద్రబాబే ఏర్పాటు చేయాలి : సదానంద గౌడ

Webdunia
గురువారం, 26 మే 2016 (09:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును ముఖ్యమంత్రి చంద్రబాబే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని కేంద్ర న్యాయశాఖామంత్రి సదానంద గౌడ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... విభజన చట్టం ప్రకాం ప్రస్తుతం ఉన్న హైకోర్టు తెలంగాణకు వెళుతుందని… కొత్తగా ఏపీకి హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. 
 
ఏపీకి హైకోర్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం వసతులు కల్పిస్తామని అంటోందని… అందుకు ఏపీ సీఎం అంగీకరించాలి కదా అన్నారు. అయినా ఈ వ్యవహారంపై కోర్టులో కేసు నడుస్తోందని, కోర్టు ఏం చేబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 
 
ఈ విషయంలో ఏపీపై మీరు ఒత్తిడి చేయొచ్చు కదా అని విలేకరులు అడగ్గా… నేను ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేనన్నారు. మొత్తానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి సమాధానాన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్ర ఎంపీలు, ప్రభుత్వం ఎంతగా ఒత్తిడి చేసినా… తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో కేంద్రం చేయగలిగిందేమీ లేదని తేటతెల్లమైపోయింది. 

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments